ఏపి మద్యం.కుంభకోన్.కేసులో ఏ4.గా ఉన్న వైకాపా ఎంపీ మూడు రెడ్డి.కి.ఆగస్టు 1 వరకు.రిమాండ్
అమరావతి, 20 జూలై (హి.స.) : ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఏ4గా ఉన్న వైకాపా ఎంపీ మిథున్‌రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్‌ విధించింది. ఆగస్టు 1 వరకు రిమాండ్‌ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో మిథున్‌రెడ్డిని పోలీసులు రాజమండ్రి సెం
ఏపి మద్యం.కుంభకోన్.కేసులో ఏ4.గా ఉన్న వైకాపా ఎంపీ  మూడు రెడ్డి.కి.ఆగస్టు 1 వరకు.రిమాండ్


అమరావతి, 20 జూలై (హి.స.)

: ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఏ4గా ఉన్న వైకాపా ఎంపీ మిథున్‌రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్‌ విధించింది. ఆగస్టు 1 వరకు రిమాండ్‌ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో మిథున్‌రెడ్డిని పోలీసులు రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించనున్నారు. మిథున్‌రెడ్డిని శనివారం అరెస్టు చేసిన సిట్‌ అధికారులు.. ఇవాళ విజయవాడ కోర్టు ఎదుట హాజరుపరిచిన సంగతి తెలిసిందే.

అంతకు ముందు సిట్‌ కార్యాలయం నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. బీపీ, షుగర్‌, ఈసీజీ వంటి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని నిర్ధరించడంతో అధికారులు ఆయన్ను ఏసీబీ కోర్టు జడ్జి ఎదుట హాజరు పర్చారు. మిథున్‌రెడ్డి అరెస్టుకు 29 కారణాలను సిట్‌ కోర్టుకు నివేదించింది. సెక్షన్‌ 409, 420, 120(బీ), రెడ్‌విత్‌ 34, 37, ప్రివెన్షన్‌ ఆప్‌ కరెప్షన్‌ యాక్టు 7, 7ఏ, 8, 13(1)(బీ), 13(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande