తెలంగాణ, నాగర్ కర్నూల్. 21 జూలై (హి.స.)
విధుల్లో అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ వైద్య సిబ్బందిని హెచ్చరించారు. సోమవారం అచ్చంపేట వంద పడకల దవాఖానను ఆయన అకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు వైద్యులు నిరంతరం అందుబాటులో ఉండాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులు వ్యాపిస్తున్న వేళ వైద్యులు, స్టాప్ నర్సులు, సిబ్బంది రోగులకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని సూచించారు.
వార్డులో ఉన్నటువంటి రోగులను పరామర్శించారు. రోగులకు అందుతున్న వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అచ్చంపేట ఏరియా హాస్పిటల్లో ఆగస్టు 6వ తేదీ నుండి మెగా సర్జికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అచ్చంపేట నియోజకవర్గ పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు