అమరావతి, 21 జూలై (హి.స.):ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహించే అగ్రికల్చర్ డిప్లమో కోర్సులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవటానికి ఆఖరి తేదీని ఈనెల 25 వరకు పొడిగించారు. ఈ మేరకు రిజిస్ర్టార్ రామచంద్రరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. తిరుపతిలోని వ్యవసాయ కళాశాలలో డిప్లమో కోర్సులో ప్రవేశానికి అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు. 2025-26 సంవత్సరానికి తిరుపతిలో కూడా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునే అవకాశం ఇస్తున్నట్లు వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ