విశాఖపట్నం, 21 జూలై (హి.స.)
:ఆంధ్రప్రదేశ లో రాబోయే నాలుగు రోజులపాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు( కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతోపాటు ద్రోణి ప్రభావం కొనసాగుతోందని, దీని వల్ల భారీ వానలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ