తెలంగాణ, పెద్దపల్లి. 21 జూలై (హి.స.)
అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం జరిగేలా చూస్తామని, పేదవర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్నది రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమని పెద్దపల్లి ఎమ్మెల్యే సిహెచ్ విజయరమణారావు అన్నారు. సోమవారం వారు పెద్దపల్లి మండలంలోని రాంపల్లి, మారెడుగొండ, గుర్రాంపల్లి, గ్రామాల్లో పలు సీసీ రోడ్లు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఆయా గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేసి ముగ్గులు పోసి శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందని కొందరు గిట్టనివారు మాత్రమే ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలని చూస్తున్నారని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు