కడప- 22 జూలై (హి.స.), జమ్మలమడుగు: ప్రముఖ పర్యాటక ప్రాంతమైన జమ్మలమడుగు మండలం గండికోటలో ఈ నెల 14న ఇంటర్ విద్యార్థిని హత్యకు గురైంది. ఈ కేసు విచారణాపర్వం రోజుకో మలుపు తిరుగుతోంది. తొలుత కొందరిపై అనుమానాలు రేకెత్తాయి. ఆ తర్వాత సదరు వ్యక్తుల ప్రమేయం లేదని గుర్తించారు. చివరికి నిందితులు అయినవారే అనే దిశగా ఇప్పుడు పోలీసుల వేళ్లు చూపుతున్నాయి. ఈ మేరకు బలమైన ఆధారాలు సేకరించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ