పాడి పంటలను ప్రోత్సహించేందుకు పటిష్ట చర్యలు : మంత్రి తుమ్మల
తెలంగాణ, ఖమ్మం. 22 జూలై (హి.స.) పాడి పంటలను ప్రోత్సహించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ ఎండి
మంత్రి తుమ్మల


తెలంగాణ, ఖమ్మం. 22 జూలై (హి.స.)

పాడి పంటలను ప్రోత్సహించేందుకు

పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ ఎండి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి లతో కలిసి మంగళవారం ఖమ్మం విజయ డెయిరీ యూనిట్ తనిఖీ చేసి, అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ... 50 సంవత్సరాల క్రితం 1975 లో విజయ డెయిరీ యూనిట్ ప్రారంభమైందని, ప్రస్తుతం ఆ భవనం వెంటనే రెనోవేషన్ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. విజయ డైరీ యూనిట్ నందు సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు ద్వారా బయట నుంచి విద్యుత్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని, మంచి నీరు కూడా మున్సిపాలిటీ నుంచి సరఫరా చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని మంత్రి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. విజయ డైరీ చుట్టుపక్కల కాలనీలోని డ్రైన్లు సంస్థలోకి వస్తున్నాయని, దీని కోసం డ్రైన్ డైవర్షన్, కాంపౌండ్ వాల్ నిర్మాణంపై కార్యాచరణ చేయాలని మంత్రి తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande