తెలంగాణ, ఆదిలాబాద్. 22 జూలై (హి.స.)
కాగజ్నగర్ అటవీ డివిజన్ మహారాష్ట్ర సరిహద్దులోని రహదారిపై పెద్దపులి సంచారం కలకలం రేపింది. మంగళవారం చంద్రపూర్ జిల్లా మూల్ తాలూకా కెస్లాగూడ రహదారిపై పెద్దపులి సంచరించడంతో వాహనదారులు ఒకింత ఆందోళన చెందారు. ఈ అటవీ ప్రాంతం నుండి రోడ్డు దాటుతుండగా వాహనదారులు పులి కదలికలపై తమ సెల్ ఫోన్ లో వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టారు. గత 4 నెలల క్రితం ఈ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తూ ముగ్గురు ప్రాణాలను బలిగొన్న సంఘటన అప్పట్లో కలకలం రేపింది. కాగా తిరిగి ఇదే ప్రాంతంలో కొత్తగా వలస వచ్చిన పెద్ద పులి సంచరిస్తున్నట్టు సరిహద్దు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మహారాష్ట్ర ఫారెస్ట్ అధికారులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు