తిరుమల, 22 జూలై (హి.స.)
: ఒంటిమిట్ట రామాలయంలో పూర్తిస్థాయి అన్నప్రసాద వితరణకు రూ.4.35 కోట్లు కేటాయిస్తున్నట్లు తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఆగస్టు నుంచి అక్కడ మూడు పూటలా భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తామన్నారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో తితిదే పాలక మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను బీఆర్ నాయుడు, తితిదే ఈవో శ్యామలరావు మీడియాకు వెల్లడించారు. తిరుమలలో రోజురోజుకూ పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్-3 నిర్మించేందుకు.. దీనిపై సాధ్యసాధ్యాలను పరిశీలించేందుకు నిపుణుల కమిటీ వేయాలని నిర్ణయించినట్లు తితిదే ఛైర్మన్ తెలిపారు. తిరుమలలో అన్ని కార్యాలయాలు ఒకేచోట ఉండేలా పరిపాలనా భవనం నిర్మించాలని నిర్ణయించామన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ