అమరావతి, 25 జూలై (హి.స.)
అమరావతి, కర్నూలులోని టెస్టింగ్ రేంజ్లో డీఆర్డీఓ డ్రోన్ ద్వారా మిసైల్ను విజయవంతంగా ప్రయోగించడంపై ఏపీ సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. మన దేశ రక్షణ పర్యావరణ వ్యవస్థ వృద్ధికి దోహదపడటం ఆంధ్రప్రదేశ్ కు గర్వంగా ఉందని చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్ (NOAR)లో UAV-లాంచ్డ్ ప్రెసిషన్ గైడెడ్ క్షిపణి (ULPGM-V3) పరీక్ష విజయవంతం చేసిన శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలకు అభినందనలు తెలిపారు. మన దేశ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడంలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగు అని చంద్రబాబు అభివర్ణించారు. ULPGM-V3 విజయం ఆత్మనిర్భర్ భారత్ నిజమైన స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని చంద్రబాబు అన్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన ట్వీట్ కు ప్రతిస్పందనగా చంద్రబాబు ఈ సందేశమిచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ