బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్కు రఘునందన్ రావు సవాల్
హైదరాబాద్, 26 జూలై (హి.స.) బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారంపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లకు ఆయన బహిరంగ సవాల్ విసిరారు. గత మూడు రోజులుగ
రఘునందన్


హైదరాబాద్, 26 జూలై (హి.స.)

బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారంపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లకు ఆయన బహిరంగ సవాల్ విసిరారు. గత మూడు రోజులుగా ఎక్కడ చూసినా బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ నేతలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని రఘునందన్ రావు ధ్వజమెత్తారు.

నాలుగున్నర దశాబ్దాలలో బీజేపీ బీసీలకు ఏం చేసిందో నేను చెబుతా. మరి బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో పీసీసీ చీఫ్, విప్ ఆది శ్రీనివాస్ చెబుతారా?” అని రఘునందన్ రావు సవాల్ విసిరారు. తాను గణాంకాలతో చర్చకు వస్తానని, ఎక్కడ రమ్మంటే అక్కడ వస్తానని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే మంత్రివర్గం మళ్ళీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 56 శాతం బీసీలు ఉంటే ముగ్గురికి మంత్రి పదవులు ఇవ్వడం కరెక్టేనా ఆది సీనన్నా? అని ప్రశ్నించారు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ 250 మందిని ముఖ్యమంత్రులను చేస్తే అందులో 43 మంది మాత్రమే ఓబీసీలు ఉన్నారని తెలిపారు. అదే బీజేపీ 68 మంది ముఖ్యమంత్రులను చేస్తే అందులో 21 మంది ఓబీసీలు ఉన్నారని పేర్కొన్నారు. అంటే, “బీజేపీ 31 శాతం ఓబీసీలను సీఎంలుగా చేసింది, కాంగ్రెస్ పార్టీ 17 శాతం మందిని మాత్రమే సీఎం చేసింది” అని వివరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande