తెలంగాణ,సిద్దిపేట. 26 జూలై (హి.స.)
భూభారతి రెవెన్యూ సదస్సుల
ద్వారా ఆయా గ్రామాల్లో స్వీకరించిన అప్లికేషన్లను యుద్ధ ప్రాతిపాదికన డిస్పోజల్ చేయాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె.హైమావతి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శనివారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఆర్డీవోలు, తహశీల్దారులు, భూ భారతి స్పెషల్ అధికారులతో జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ కలిసి జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ...
ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న భూ సమస్యలకు పరిష్కారం కొరకు శాశ్వత పరిష్కారం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టం తీసుకొచ్చిందని తెలిపారు. భూ హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన భూ భారతి చట్టం అమలులో భాగంగా జిల్లాలో విజయవంతంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించామని, ప్రజల నుంచి భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను భూ భారతి చట్టం నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించి వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. ఈ
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు