యూరియా కొరతకు కారణం కాంగ్రెస్ నాయకులే కారణం :రామచందర్ రావు
తెలంగాణ,జోగులాంబ గద్వాల : 27 జూలై (హి.స.) రాష్ట్రంలో ఎరువుల కొరత కేవలం కాంగ్రెస్ నాయకుల ప్రమేయం తో బ్లాక్ మార్కెట్ కు పోయిందని అందుకే రాష్ట్రం లో రైతులు యూరియా కొరత తో తీవ్ర ఇబ్బందులకు గురైవుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు విమర్శ
రామచందర్ రావు


తెలంగాణ,జోగులాంబ గద్వాల : 27 జూలై (హి.స.)

రాష్ట్రంలో ఎరువుల కొరత కేవలం కాంగ్రెస్ నాయకుల ప్రమేయం తో బ్లాక్ మార్కెట్ కు పోయిందని అందుకే రాష్ట్రం లో రైతులు యూరియా కొరత తో తీవ్ర ఇబ్బందులకు గురైవుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు విమర్శించారు. ఆదివారం గద్వాల పట్టణం లో కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం లోనే ఎక్కువ మంది రైతులు మృత్యువాత పడ్డారని ఆరోపించారు.

రైతులకు కావాల్సిన ఎరువులను కృత్రిమంగా కొరత సృష్టించి రాష్ట్రం లోని రైతులను నడిరోడ్డు పై నిలబడేటట్లు చేసారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన ఎరువులు తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల కు పైగా అవసరం కాగా కేంద్ర ప్రభుత్వం అదనంగా 12 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అందించిందని దీనికి రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చర్చకు సిద్ధమా అంటూ ప్రశ్నించారు.కాంగ్రెస్ నాయకులు కావాలనే ఎరువులను బ్లాక్ మార్కెట్ కు మరియు ఇతర అవసరాల కోసం యూరియా ను తరలించారని, దేశం లో ఎక్కడ లేని ఎరువుల కొరత కేవలం తెలంగాణ రాష్ట్రం లోనే ఎందుకు ఉందని ఆయన ప్రశ్నించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande