అమరావతి, 27 జూలై (హి.స.)
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. శాస్త్రవేత్తగా దేశ అణు, శాస్త్రీయ రంగాలకు మార్గనిర్దేశం చేసిన దార్శనికుడు, ప్రజల రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఆ మహోన్నత మానవతావాది సేవలను స్మరించుకుందామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
లోకేశ్
భారతరత్న, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. భారతజాతి గర్వించదగ్గ గొప్ప మేధావి అబ్దుల్ కలాం. మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు గడించారన్నారు. శాస్త్రవేత్తగా దేశానికి ఆయన అందించిన సేవలు నిరుపమానం అని శ్లాఘించారు. తనదైన వ్యక్తిత్వం, ప్రసంగాలతో లక్షలాది మందిలో స్ఫూర్తి నింపారన్నారు. వారి ఆశయ సాధన కోసం ప్రతిఒక్కరం కృషి చేద్దామని నారా లోకేశ్ పిలుపునిచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి