తిరుమల, 28 జూలై (హి.స.)
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు.
ఈ తరుణంలో తిరుమలలో భక్తుల రద్దీ గత వారం రోజులుగా కొనసాగుతుంది. ఈ క్రమంలో నేడు(సోమవారం) తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.
శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. భక్తులు 12 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. క్యూలైన్లోని భక్తులకు శ్రీవేంకటేశ్వర స్వామి వారి సేవకుల ద్వారా అన్నప్రసాదం, పాలు, తాగునీరు అందిస్తున్నారు.
నిన్న(ఆదివారం) శ్రీవారిని 85,486 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,929 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవేంకటేశ్వర స్వామి వారి హుండీ ఆదాయం(Hundi Income) రూ.3.85 కోట్లు వచ్చిందని టీటీడీ(TTD) అధికారులు తెలిపారు. గత నెల(జూన్)లో సాధారణం కంటే అధికంగా శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ నెల(జూలై)లో సాధారణ రోజుల్లో సైతం భక్తుల రద్దీ ఉంటుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి