హైదరాబాద్, 3 జూలై (హి.స.)
: రంగారెడ్డి జిల్లా కాటేదాన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కాటేదాన్లోని శివం రబ్బర్ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని నాలుగు అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పివేశారు. పరిశ్రమలో రబ్బరు సామగ్రి ఎక్కువగా ఉండటంతో దట్టమైన పొగలు వ్యాపించాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ