తప్పులు లేకుండా ఓటరు జాబితాను సవరించాలి: అడిషనల్ కలెక్టర్
వికారాబాద్., 3 జూలై (హి.స.) ఎలాంటి తప్పులు లేకుండా ఉండే ిధంగా ఓటర్ల జాబితాను సవరించాలని వికారాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్ అధికారులను ఆదేశించారు. గురువారం కొడంగల్ లో బూత్ లెవెల్ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగ
అడిషనల్ కలెక్టర్


వికారాబాద్., 3 జూలై (హి.స.)

ఎలాంటి తప్పులు లేకుండా ఉండే ిధంగా ఓటర్ల జాబితాను సవరించాలని వికారాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్ అధికారులను ఆదేశించారు. గురువారం కొడంగల్ లో బూత్ లెవెల్ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల జాబితాను ముందు ఉంచుకొని వాటిని క్షుణంగా పరిశీలించి ఏదైనా తప్పులు ఉంటే సవరించాలన్నారు. అలాగే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయించాలని పేర్కొన్నారు. బిఎల్దలు తమ పరిధిలో ఇంటింటి సర్వే నిర్వహించి జాబితాలో తప్పులు లేకుండా సరిదిద్దాలని ఆదేశించారు.

ఓటరు జాబితాలో తప్పు ఒప్పులు ఉన్న మార్పులు చేర్పులు ఉన్న, మరణించిన వారి పేర్లను తొలగించాల్సి ఉన్న వాటిని సరిచూసుకొని ఓటరు జాబితాను సవరించుకోవాలని సూచించారు. సరళమైన ఓటరు జాబితా అందుబాటులో ఉంటే ఎన్నికల సమయంలో ఇబ్బందులు ఉండవని సూచించారు. ఓటరు జాబితా సరి చేసుకోవడంలో బిఎల్వోలు ప్రత్యేక దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande