పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి సమయం ఎంతంటే?
తిరుమల, 3 జూలై (హి.స.)కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు. ఈ క్రమంలో ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తిరుమల చేరుకుని.. భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటారు. ఈ తర
తిరుమల


తిరుమల, 3 జూలై (హి.స.)కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు. ఈ క్రమంలో ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తిరుమల చేరుకుని.. భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటారు.

ఈ తరుణంలో తిరుమల కొండపై భక్తుల రద్దీ కొన్ని సార్లు సాధారణంగా లేదా అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో నేడు(గురువారం) తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ స్వల్పంగా పెరిగింది. గురువారం తిరుమలశ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో 11 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శనానికి 12 నుంచి 15 గంటల సమయం పడుతోంది. నిన్న(బుధవారం) శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని 74,510 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,050 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవేంకటేశ్వర స్వామి వారి హుండీ ఆదాయం(Hundi Income) రూ.3.98 కోట్లు వచ్చిందని టీటీడీ(TTD) అధికారులు వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande