సమైక్య రాష్ట్రంలో నీళ్లు ఇవ్వలేదు కాబట్టే తెలంగాణ ఉద్యమం పుట్టింది.. కేటీఆర్
హైదరాబాద్, 5 జూలై (హి.స.) బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ సీఎం రేవంత్, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. నేడు తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో కేటీఆర్ మాట్లాడుతూ.. “నీటికి పల్లం ఎలా తెలుసో తెలంగాణ
కేటీఆర్


హైదరాబాద్, 5 జూలై (హి.స.)

బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ సీఎం రేవంత్, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. నేడు తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో కేటీఆర్ మాట్లాడుతూ.. “నీటికి పల్లం ఎలా తెలుసో తెలంగాణ కు నీరు ఎవరు తీసుకు వచ్చారో అందరికి తెలుసు.. తెలంగాణ లో ఏ రైతు ను, ఎద్దును అడిగినా వ్యవసాయం పండుగ ఎవరు చేశారో చెప్తారు.. సీఎం నిన్న రంకెలు వేశాడు.. ఆయన సభపెట్టాడంటే బూతులతోనే మాట్లాడతాడు.. మా పార్టీ తరుపున మీ సవాలు స్వీకరిస్తున్నాం.. ఎక్కడ చర్చ పెట్టినా వస్తాం.. మీకు కేసీఆర్ అవసరం లేదు.. మేము చాలు.. 72 గంటలు ఇస్తున్నాం.. మీరు ప్రిపేర్ అయి రండి.. సీఎంకు బేసిన్ లు తెలియదు బెండకాయలు తెలియదు.. సమైక్య రాష్ట్రంలో నీళ్లు ఇవ్వలేదు కాబట్టే తెలంగాణ ఉద్యమం పుట్టింది.. సీఎం రేవంత్ రెడ్డి హయాంలో నీళ్లు ఆంధ్రకు, నిధులు ఢిల్లీకి, నియామకాలు ఆయన అనునాయులకు వచ్చాయి.. ఇందిరమ్మ రాజ్యం గొప్పతనం తెలియాలి అంటే బట్టలు విప్పి కొడతాం అన్నారు.. బనకచర్ల ద్వారా మీ గురువు చంద్రబాబు తీసుకెళ్తుంటే మీ తీరు తెలంగాణ సమాజం చూస్తూనే ఉందన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande