అమరావతి, 5 జూలై (హి.స.)
నెల్లూరు: నెల్లూరులోని బారాషహీద్ దర్గా వద్ద భక్తుల సందడి మొదలైంది. రొట్టెల పండగకు ఒకరోజు ముందుగానే వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఆదివారం నుంచి ఐదు రోజుల పాటు రొట్టెల పండగ జరగనుంది. మత సామరస్యానికి చిహ్నంగా, బారాషహీద్ల త్యాగనిరతిని స్మరిస్తూ ఏటా ఈ వేడుకను నిర్వహిస్తుంటారు. ఈక్రమంలో స్వర్ణాల చెరువు వద్ద సందర్శకుల తాకిడి మొదలైంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ