అమరావతి,, తిరుపతి: తిరుమలలో శ్రీవారి దర్శనానికి కనుమదారిలో వచ్చే ప్రైవేటు కార్లు 8 వేల వరకూ ఉంటున్నాయి. సప్తగిరుల్లో వాయు కాలుష్యం అంతకంతకూ పెరుగుతుండటంతో వీటిల్లో పరిమితులకు మించి పొగ వెదజల్లే కార్లను గుర్తించి వెనక్కి పంపేయాలని తితిదే నిర్ణయించింది. అలిపిరిలో తనిఖీ కేంద్రం ఏర్పాటు చేసి, పొల్యూషన్ సర్టిఫికెట్ లేనివాటిని, పొగ ఎక్కువగా వదులుతున్న వాటిని ర్యాండమ్గా తనిఖీ చేయిస్తోంది. స్మోక్ మీటర్లో ఉద్గారాలు 4.0కు మించిఉంటే వెనక్కు పంపుతున్నట్లు ఇక్కడి సిబ్బంది వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ