విజయవాడ, 1 ఆగస్టు (హి.స.)
:మద్యం కుంభకోణం కేసులో(12 మంది నిందితులు ఇవాళ(శుక్రవారం) విజయవాడ ఏసీబీ కోర్టులో(హాజరయ్యారు. తమకుబెయిల్ కావాలని వీరు న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశారు. నిందితులు వేసిన పిటిషన్లపై న్యాయస్థానం ఇవాళ విచారణ చేపట్టింది. 12 మంది నిందితుల పిటిషన్లని కోర్టు వాయిదా వేసింది.ఈ సందర్భంగానిందితులకి ఈనెల(ఆగస్టు)13 తేదీ వరకు ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగించింది. కోర్టు విచారణ అనంతరం రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్రెడ్డిని రోడ్డు మార్గం ద్వారా రాజమండ్రి కేంద్రకారాగారానికి తరలించారు. బాలాజీ, నవీన్లను గుంటూరు సబ్ జైలుకు తరలించారు. మిగిలిన తొమ్మిది మంది నిందితులని విజయవాడ జిల్లా జైలుకి పోలీసులు తరలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ