ఓనమాలు రాని వాళ్లు కూడా జర్నలిస్టుల పేరిట చలామణి అవుతున్నారు.. సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, 1 ఆగస్టు (హి.స.) ప్రభుత్వాల తప్పులను ఎత్తిచూపడంలో కమ్యూనిస్టులను మించిన వాళ్లు లేరని.. అదేవిధంగా అధికారంలో ఉన్న వారిని గద్దె దింపడంలోనూ వాళ్లే ఉపయోగపడుతారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ ''నవ తెలంగాణ'' 10 వ వార్షికోత్సవానికి హాజర
సీఎం రేవంత్ రెడ్డి


హైదరాబాద్, 1 ఆగస్టు (హి.స.)

ప్రభుత్వాల తప్పులను

ఎత్తిచూపడంలో కమ్యూనిస్టులను మించిన వాళ్లు లేరని.. అదేవిధంగా అధికారంలో ఉన్న వారిని గద్దె దింపడంలోనూ వాళ్లే ఉపయోగపడుతారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ 'నవ తెలంగాణ' 10 వ వార్షికోత్సవానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం జర్నలిజం విలువలు పూర్తిగా దెబ్బతిన్నాయని కామెంట్ చేశారు. ఓనమాలు కూడా రానివాళ్లు సోషల్ మీడియా ముసుగుతో జర్నలిస్టుగా చలామణి అవుతున్నారని ఫైర్ అయ్యారు. అలాంటి వారిని సీనియర్లు జర్నలిస్టులు పక్కన పెట్టాలని.. కనీసం పక్కన కూడా కూర్చొబెట్టుకోవద్దని అన్నారు. ఆవారాగా రోడ్ల మీద తిరుగుతూ.. అసభ్యకరంగా మాట్లాడేవాడు జర్నలిస్టు అని చెప్పుకోవడం సోచనీమని పేర్కొన్నారు. తనకు మొదటి నుంచి కమ్యూనిస్టులంటే అపారమైన గౌరవం ఉందన్నారు. 2004లోనూ కాంగ్రెస్ గెలుపులో వారి పాత్ర మరువలేనదిన అన్నారు. ప్రజావ్యతిరేక విధానాలకు గలమెత్తాలన్నా.. అధికారంలో ఉన్నోళ్లను గద్దె దింపడానికైనా కమ్యునిస్టులు ఉపయోగపడతారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాజకీయ నేతల విశ్వసనీయత దెబ్బతిన్నట్లుగానే.. జర్నలిస్టుల విశ్వసనీయత క్రమంగా తగ్గుతూ వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande