ఏపి.మద్యం.కుంభకోణం కేసు లో.నిందితులకు ఈ నెల 26 వరకు. రిమాండ్.పొడిగింపు
అమరావతి, 13 ఆగస్టు (హి.స.) విజయవాడ: ఏపీ మద్యం కుంభకోణం కేసులో నిందితులకు ఈనెల 26 వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ్టితో వారి రిమాండ్‌ ముగుస్తున్న నేపథ్యంలో నిందితులను సిట్‌ అధికారులు కోర్టులో హాజరుపర్చారు. మర
ఏపి.మద్యం.కుంభకోణం కేసు లో.నిందితులకు ఈ నెల 26 వరకు. రిమాండ్.పొడిగింపు


అమరావతి, 13 ఆగస్టు (హి.స.)

విజయవాడ: ఏపీ మద్యం కుంభకోణం కేసులో నిందితులకు ఈనెల 26 వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ్టితో వారి రిమాండ్‌ ముగుస్తున్న నేపథ్యంలో నిందితులను సిట్‌ అధికారులు కోర్టులో హాజరుపర్చారు. మరింత విచారణ జరపాల్సి ఉందని అధికారులు కోరడంతో నిందితులకు న్యాయస్థానం రిమాండ్‌ను పొడిగించింది. ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో రాజ్‌ కెసిరెడ్డి, చాణక్య, దిలీప్‌, సజ్జల శ్రీధర్‌రెడ్డి, ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, గోవిందప్ప బాలాజీ .. గుంటూరు జిల్లా కారాగారంలో నవీన్‌ కృష్ణ, బాలాజీకుమార్‌ యాదవ్‌ రిమాండ్‌లో ఉన్నారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో మిథున్‌రెడ్డి జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande