భారీ వర్షాల నేపద్యం..ఖమ్మం పోలీస్ కమిషనర్ అలెర్ట్..
ఖమ్మం, 13 ఆగస్టు (హి.స.) జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని,వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని ఖమ్మం జిల్లా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ప్రధానంగా వాగులు వంకలన్నీ ఉధ
ఖమ్మం కమిషనర్


ఖమ్మం, 13 ఆగస్టు (హి.స.)

జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని,వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని ఖమ్మం జిల్లా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ప్రధానంగా వాగులు వంకలన్నీ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రోడ్డు జలమయమయ్యే ప్రాంతాల్లో ప్రజలు రోడ్డు దాటే ప్రయత్నం చేయవద్దని సూచించారు. పిల్లలు ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలన్నారు. ముఖ్యంగా చేపల వేటకు వెళ్లవద్దని, పశువుల కాపర్లు చెరువులు, వాగులు దాటవద్దని పెర్కొన్నారు. యువకులు సెల్ఫీల కోసం నీటి ప్రవాహం వద్దకు వెళ్లవద్దని సూచించారు. అత్యవసర సమయాల్లో డయల్ 100కు, స్థానిక పోలీసులకు, పోలీస్ కంట్రోల్ సెల్ నెంబర్ 8712659111 సమాచారం అందిచాలని సూచించారు.

ఇప్పటికే చెరువులు, వాగుల వద్ద పెట్రోలింగ్ పెంచి ప్రమాద హెచ్చరికలను తెలియజేసేలా పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. చెరువులు, కుంటల వద్ద నీటి ఉధృతిని దృష్టిలో ఉంచుకొని వంతెనలు, చప్టలపై బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రమాదాల బారిన పడకుండా వాహనాల రాకపోకలను నిషేధించాలని పోలీస్ అధికారులకు సూచించామని తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో అధిక వర్షాల మూలంగా వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని, ఈ దృష్ట్యా అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande