వికారాబాద్, 14 ఆగస్టు (హి.స.)
: జిల్లాలోని పరిగి మండల పరిధిలో భూప్రకంపనలు వచ్చాయి. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. బసిరెడ్డిపల్లి, రంగాపూర్, న్యామత్నగర్లో మూడు సెకన్లపాటు భూమి కంపించింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ