హైదరాబాద్, 14 ఆగస్టు (హి.స.) ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ భేటీ అయ్యారు. గురువారం జూబ్లీహిల్స్లోని రేవంత్ రెడ్డి నివాసంలో రాహుల్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రాహుల్కు కోటి రూపాయల నగదు ప్రోత్సాహకం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ను శాలువ కప్పి సత్కరించారు. సీఎంను కలిసిన వారిలో రాహుల్తో పాటు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి తదితరులు ఉన్నారు.
అయితే, 2023లో ఓ ప్రోగ్రామ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాహుల్ సిప్లిగంజ్కు కోటి రూపాయల నగదు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ మేరకు జూలై 20న పాతబస్తీ బోనాల సందర్భంగా రాహుల్కు కాంగ్రెస్ సర్కార్ రూ. కోటి ప్రోత్సాహకం ప్రకటించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్