తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి సమయం ఎంతంటే?
తిరుమల, 14 ఆగస్టు (హి.స.)కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు. ఈ క్రమంలో ఇవాళ తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామి వారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ క్రమంలో నేడు(గురువార
తిరుమల


తిరుమల, 14 ఆగస్టు (హి.స.)కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు.

ఈ క్రమంలో ఇవాళ తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామి వారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ క్రమంలో నేడు(గురువారం)శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం 28 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. క్యూలైన్‌లోని భక్తులకు శ్రీవేంకటేశ్వర స్వామి వారి సేవకుల ద్వారా అన్నప్రసాదం, పాలు, తాగునీరు అందిస్తున్నారు. నిన్న(బుధవారం) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని 75,859 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,344 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవేంకటేశ్వర స్వామి వారి హుండీ ఆదాయం రూ.4.31 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande