ఏపీలో మహిళలకు ఆర్టీసీలో. ఉచిత బస్సు.ప్రయాణం పథకాన్ని సీఎం చంద్రబాబు.ప్రారంభించారు
అమరావతి, 15 ఆగస్టు (హి.స.) ఏపీలో మహిళలకు ఆర్టీసీలో ఉచితబస్సు ప్రయాణం పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. గుంటూరు జిల్లా ఉండవల్లి గుహల వద్ద ఈ పథకాన్ని ప్రారంభించిన అనంతరం డిప్యూటీ సీఎం పవన్‌, మంత్రి లోకేశ్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్
ఏపీలో మహిళలకు ఆర్టీసీలో. ఉచిత బస్సు.ప్రయాణం పథకాన్ని సీఎం చంద్రబాబు.ప్రారంభించారు


అమరావతి, 15 ఆగస్టు (హి.స.)

ఏపీలో మహిళలకు ఆర్టీసీలో ఉచితబస్సు ప్రయాణం పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. గుంటూరు జిల్లా ఉండవల్లి గుహల వద్ద ఈ పథకాన్ని ప్రారంభించిన అనంతరం డిప్యూటీ సీఎం పవన్‌, మంత్రి లోకేశ్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌తో కలిసి సీఎం విజయవాడకు బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా బస్సులో మహిళలతో సీఎం మాట్లాడారు. అంతకుముందు ఉండవల్లి గుహల వద్దకు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి సీఎం చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు. అనంతరం విజయవాడలోని పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రబాబు, పవన్‌, లోకేశ్‌ మాట్లాడారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande