ఖజానా.జ్యువెలరీ దోపిడి. కేసులో ముగ్గురి..నిందితులను పోలీసులు అరెస్ట్
హైదరాబాద్‌ 15 ఆగస్టు (హి.స.) : ఖజానా జ్యువెలరీలో దోపిడీ కేసులో ముగ్గురు నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. బీదర్‌లో ఇద్దరిని, పుణెలో మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను బిహార్‌ వాసులుగా గుర్తించారు. ఈనెల 12న చందానగర్‌లోని ఖజానా జ్యువెలరీలో
Crime


హైదరాబాద్‌ 15 ఆగస్టు (హి.స.)

: ఖజానా జ్యువెలరీలో దోపిడీ కేసులో ముగ్గురు నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. బీదర్‌లో ఇద్దరిని, పుణెలో మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను బిహార్‌ వాసులుగా గుర్తించారు. ఈనెల 12న చందానగర్‌లోని ఖజానా జ్యువెలరీలో దోపిడీ జరిగిన సంగతి తెలిసిందే. నగల దుకాణం ఉద్యోగిపై కాల్పులు జరిపిన ముఠా దోపిడీకి పాల్పడింది. నెల రోజుల క్రితం ఈ బిహార్‌ ముఠా హైదరాబాద్‌కు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. జగద్గిరిగుట్టలో ఉంటూ ఓ గ్లాసు పరిశ్రమలో పనిలో చేరారు. బిహార్‌ నుంచి వచ్చేటప్పుడు తుపాకులు తెచ్చుకొని, కొన్ని రోజుల పాటు రెక్కీ నిర్వహించారు. దోపిడీ చేసిన అనంతరం పరారయ్యారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande