ఖజానా జువెల్లర్స్ లో దోపిడీ.. ముగ్గురు నిందితులు అరెస్ట్
హైదరాబాద్, 15 ఆగస్టు (హి.స.) హైదరాబాద్లో పట్టపగలే ఖజానా జువెలరీ షాప్ లో కాల్పులు జరుపుతూ దోపిడీకి పాల్పడిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ముగ్గురు నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. బీదర్లో ఇద్దరిని, పుణెలో మరొకరిని అదుపులోకి తీసుకున్న
ఖజానా జువెల్లర్స్ లో


హైదరాబాద్, 15 ఆగస్టు (హి.స.) హైదరాబాద్లో పట్టపగలే ఖజానా జువెలరీ షాప్ లో కాల్పులు జరుపుతూ దోపిడీకి పాల్పడిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ముగ్గురు నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. బీదర్లో ఇద్దరిని, పుణెలో మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు నిందులు బీహార్కు చెందిన వారిగా గుర్తించారు. వారిని హైదరాబాదు తరలిస్తున్నారు.

ఈ నెల 12న చందానగర్లోని ఖజానా జ్యవెలర్స్లో పట్టపగలే దోపిడీ జరిగిన విషయం తెలిసిందే.

కాగా, దోపిడీ ముఠా నెల క్రితమే బీహార్ నుంచి హైదరాబాద్కు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. జగద్గిరిగుట్టలో ఉంటూ ఓ గ్లాసు పరిశ్రమలో పనిలో చేరారు. బీహార్ నుంచి వచ్చేటప్పుడు తుపాకులు తెచ్చుకొని, కొన్ని రోజుల పాటు రెక్కీ నిర్వహించారు. దోపిడీ అనంతరం ఇక్కడి నుంచి పరారయ్యారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande