అమరావతి, 16 ఆగస్టు (హి.స.)
శ్రీశైలం (సున్నిపెంట సర్కిల్): శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతుండటంతో మరో గేటును ఎత్తారు. ప్రస్తుతం 5 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలంలో 1,89,169 క్యూసెక్కులు చేరుతోంది. శ్రీశైలం నుంచి 2,34,544 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 35,000 క్యూసెక్కులు, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,509 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 5 స్పిల్ వే గేట్ల ద్వారా 1,33,720 క్యూసెక్కులు నాగార్జునసాగర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.10 అడుగులకు చేరింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ