శ్రీహరికోట, 16 ఆగస్టు (హి.స.): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా ఈ ఏడాది అక్టోబరులో జీ1 (మానవ రహిత) ప్రయోగం చేపట్టనున్నట్లు షార్ డైరెక్టర్ ఇ.ఎస్.పద్మకుమార్ తెలిపారు. తిరుపతి జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గగన్యాన్ పనులు షార్లో చురుగ్గా జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే కొన్ని పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. వచ్చే ఏడాది జీ2, జీ3 ప్రయోగాలు చేపట్టనున్నట్లు వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ