భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు..
ముంబై, 18 ఆగస్టు (హి.స.) భారత స్టాక్ మార్కెట్లు సోమవారం జోష్తో ప్రారంభించాయి. గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఎస్ & పీ గ్లోబల్ భారత్ రేటింగు ఎగదీసిన నేపథ్యంలో, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన జిఎస్టి తగ్గింపు హామీ పెట్టుబడిదారులకు ఉత్సాహాన్నిచ్చింద
స్టాక్ మార్కెట్


ముంబై, 18 ఆగస్టు (హి.స.) భారత స్టాక్ మార్కెట్లు సోమవారం జోష్తో ప్రారంభించాయి. గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఎస్ & పీ గ్లోబల్ భారత్ రేటింగు ఎగదీసిన నేపథ్యంలో, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన జిఎస్టి తగ్గింపు హామీ పెట్టుబడిదారులకు ఉత్సాహాన్నిచ్చింది. ఫలితంగా సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాల్లో ట్రేడవుతూ మార్కెట్ సెంటిమెంట్ను పాజిటివ్ మార్చాయి.స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.20 గంటల సమయానికి సెన్సెక్స్ 974 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. నిఫ్టీ 320 పాయింట్ల లాభంతో 24,951 వద్ద ట్రేడవుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande