కొందరి వల్ల బీజేపీకి చాలా నష్టం జరుగుతోంది.. రాజాసింగ్
హైదరాబాద్, 17 ఆగస్టు (హి.స.) తెలంగాణ బీజేపీ పై గోషామహాల్ ఎమ్మెల్యే టి. రాజాసింగ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో మాట్లాడారు. ''తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాదు. ప్రతి నియోజకవర్గంలో, ప్రతి జిల్లాలో నా మనిషే అంట
రాజాసింగ్


హైదరాబాద్, 17 ఆగస్టు (హి.స.)

తెలంగాణ బీజేపీ పై గోషామహాల్ ఎమ్మెల్యే టి. రాజాసింగ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో మాట్లాడారు. 'తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాదు. ప్రతి నియోజకవర్గంలో, ప్రతి జిల్లాలో నా మనిషే అంటే, ఎన్నో ఏళ్ల నుండి ప్రాణం పెట్టి పనిచేసిన పాత కార్యకర్తలు ఎక్కడికి పోవాలి. బీజేపీ అధిష్టానం కూడా తెలంగాణ మీద దృష్టి పెట్టదు.. వాళ్ళు వేరే రాష్ట్రాలను చూసుకుంటారు. రాష్ట్రంలోని పెద్ద బాబులు చెప్పిందే అధిష్టానం వింటుంది. వాళ్ళ పేర్లు చెప్పలేను కానీ, వాళ్ళ వల్ల తెలంగాణ బీజేపీకి చాలా నష్టం జరుగుతుంది' అని రాజాసింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande