అమరావతి, 2 ఆగస్టు (హి.స.)
కృష్ణమ్మ రాకతో జిల్లాలోని జలాశయాలకు జలకళ వచ్చింది. పద్దెనిమిదేళ్ల తర్వాత జులైలోనే సాగర్ క్రస్టు గేట్లు ఎత్తడం.. దిగువనున్న ప్రాజెక్టులు నిండటంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల పరిధిలోని మేజర్ కాలువలు, బ్రాంచ్ కెనాళ్లకు నీటిని విడుదల చేశారు. గతేడాది ఆగస్టు 5 తర్వాత జలాశయాలకు వరద నీరు వచ్చింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ