పుట్టపర్తి , 2 ఆగస్టు (హి.స.)పుట్టపర్తి, : పుట్టపర్తి సత్యసాయి బాబా శత జయంతి వేడుక ల్లో పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోదీని సత్యసాయి సెంట్రల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ ఆహ్వానించారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, ట్రస్టు ప్రతినిధులు జస్టిస్ రామసుబ్రహ్మణ్యం, నాగానందం, హీరా, సత్యసాయి సేవాసంస్థల జాతీయ అధ్యక్షుడు నిమీష్ పాండేతో కలిసి ఆయన ఢిల్లీలో ప్రధాని మోదీని శుక్రవారం కలిశారు. నవంబరులో జరిగే శత జయంతి వేడుకల్లో పాల్గొనాలని కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి