దిల్లీ: 2 ,ఆగస్టు (హి.స.) జమ్మూకాశ్మీర్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. రియాసి కొండచరియలు విరిగిపడి జమ్మూ కాశ్మీర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి రాజిందర్ సింగ్ రాణా, ఆయన కుమారుడు అక్కడికక్కడే మరణించారు. ఆయన భార్యకు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. రాజిందర్ సింగ్ రాణా తన సొంత గ్రామానికి వెళ్తుండగా ఈ ఘోర విషాదం చోటుచేసుకుంది.
రాజిందర్ సింగ్ రాణా.. రియాసి జిల్లాలో సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్గా పని చేస్తున్నారు. రాజిందర్ సింగ్ రాణా తన కుటుంబంతో కలిసి ధర్మరి నుంచి తన స్వస్థలమైన పట్టియాన్కు వెళుతుండగా సలుఖ్ ఇఖ్తర్ నల్లా ప్రాంతంలో గురువారం రాత్రి కొండచరియల భాగంలో ఒక పెద్ద బండరాయి వాహనంపై పడింది. దీంతో కారులో ఉన్న రాజిందర్ సింగ్ రాణా, ఆయన కుమారుడు సంఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోగా.. ఆయన భార్యకు గాయాలయ్యాయి. ఈ మేరకు అధికారులు వివరాలు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ