తిరుమల , 2 ఆగస్టు (హి.స.)తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ఈ క్రమంలో ప్రపంచ నలుమూలల నుంచి శ్రీవారి భక్తులు తిరుమల కొండకు చేరుకొని.. భక్తి శ్రద్ధలతో పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని సినీ, రాజకీయ ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఈ నేపథ్యంలో ఇవాళ(శనివారం) తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దర్శించుకున్నారు. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి నిన్న(శుక్రవారం) రాత్రి ఆయన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల కు చేరుకున్నారు.
ఈ తరుణంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గాయత్రి నిలయం లో బస చేశారు. అనంతరం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఈ రోజు ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి వారికి ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన నితిన్ గడ్కరీ దంపతులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి