తిరుమల, 2 ఆగస్టు (హి.స.)కలియుగ వైకుంఠ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల(Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు.
ఈ క్రమంలో తిరుమలలో భక్తుల రద్దీ కొన్ని సార్లు సాధారణంగా లేదా అధికంగా ఉంటుంది.
ఈ క్రమంలో ఇవాళ(శనివారం) తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.
సర్వ దర్శనం కోసం 6 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న(శుక్రవారం) స్వామి వారిని 70,353 భక్తులు దర్శించుకున్నారు. 25,636 తలనీలాలు సమర్పించారు. స్వామి వారి రూ.3.65 కోట్ల హుండీ ఆదాయం(Hundi Income) సమకూరిందని టీటీడీ(TTD) అధికారులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి