అమరావతి, 3 ఆగస్టు (హి.స.)
అమరావతి: ఎన్హెచ్-65ను ఆరు వరసలుగా భవానీపురంలోని పున్నమిఘాట్ వరకు విస్తరించేందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదం తెలిపారు. వెంటనే డీపీఆర్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నగరం నడిబొడ్డు వరకు వస్తున్నందున రహదారి మధ్యలో సుందరీకరణ పనులు చేపట్టాలనీ.. అవసరమైన నిధులు ఇస్తానని మంత్రి.. ఎంపీ చిన్నికి చెప్పడంతో మార్గం సుగమమైంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ