హిమాచల్ ప్రదేశ్ లోని. చంబా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది
చంబా, 9 ఆగస్టు (హి.స.) : హిమాచల్‌ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో ఘోరు రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందారు. రాజేష్‌ అనే వ్యక్తి శుక్రవారం రాత్రి తన కుటుంబ సభ్యులతో కారులో వెళ్తుండగా కొండప్రాంతం నుంచి పడిన ఓ రాయి కారును ఢీకొట్టింది. ద
హిమాచల్ ప్రదేశ్ లోని. చంబా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది


చంబా, 9 ఆగస్టు (హి.స.)

: హిమాచల్‌ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో ఘోరు రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందారు. రాజేష్‌ అనే వ్యక్తి శుక్రవారం రాత్రి తన కుటుంబ సభ్యులతో కారులో వెళ్తుండగా కొండప్రాంతం నుంచి పడిన ఓ రాయి కారును ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పిన కారు భారీ లోయలో పడింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన రాజేష్‌, హన్సో (36) దంపతులు, వారి కుమార్తె ఆర్తి (17), కుమారుడు దీపక్‌ (15), బావమరిది హిమరాజ్‌, మరో వ్యక్తి మృతి చెందారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande