తిరుమల, 10 సెప్టెంబర్ (హి.స.)అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది.
శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తుల దర్శనానికి దాదాపు 10 పైగా గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి (Special Darshan) 2 గంటల సమయం పడుతోంది. అదేవిధంగా ఈ రోజు బుధవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ (Vaikuntam Que Complex)లోని 19 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు.
నిన్న మంగళవారం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని 70,828 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 26,296 మంది భక్తలు శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి హుండీ (Srivari Hundi) ఆదాయం రూ.3.07 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు (TTD Offcials) తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి