భారత్‌తో యుద్ధం జరిగితే.. పాక్‌కు అండగా సౌదీ పోరాటం
న్యూఢిల్లీ,20,సెప్టెంబర్ (హి.స.) పాకిస్థాన్- సౌదీ అరేబియా(Pakistan- SaudiArabia)ల మధ్య ఇటీవలే ఓ రక్షణ ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందంపై పాక్‌ రక్షణ మంత్రి ఖవాజ్ ఆసిఫ్‌ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో ఉద్రిక్తతల సమయంలో సౌదీ అండగా
dgmo


న్యూఢిల్లీ,20,సెప్టెంబర్ (హి.స.) పాకిస్థాన్- సౌదీ అరేబియా(Pakistan- SaudiArabia)ల మధ్య ఇటీవలే ఓ రక్షణ ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందంపై పాక్‌ రక్షణ మంత్రి ఖవాజ్ ఆసిఫ్‌ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో ఉద్రిక్తతల సమయంలో సౌదీ అండగా ఉంటుందని పేర్కొన్నారు.

ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసిఫ్‌ మాట్లాడారు. పాక్‌- భారత్‌ (India-Pakistan) మధ్య ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు సౌదీ దళాలు మీకు తోడుగా నిలబడతాయా అన్న ప్రశ్నకు ‘కచ్చితంగా.. అందులో ఎలాంటి సందేహం లేదు’ అని ఆయన బదులిచ్చారు. ‘పాక్‌, సౌదీ ఏ దేశాన్ని దురాక్రమణదారుగా పేర్కొనలేదు. ఈ ఒప్పందం కేవలం ఇరువైపుల ఒక రక్షణగోడ లాంటిది. ఇరుదేశాల్లో దేని మీదైనా.. మరో దేశం దురాక్రమణకు పాల్పడితే సంయుక్తంగా కలిసి పరిష్కరించుకుంటాం. ఈ ఒప్పందం దురుద్దేశంతో చేసుకున్నది కాదు. కానీ, ఎవరైనా తమను బెదిరించాలని చూసినప్పుడు కూడా ఇది అమల్లోకి వస్తుంది’ అని ఆసిఫ్‌ పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande