అమరావతి, 22 సెప్టెంబర్ (హి.స.)
విశాఖపట్నం, సెప్టెంబర్ 22 : ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని పైన ఒక ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోంది. ఫలితంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీనికి తోడు ఈనెల 25న తూర్పు-మధ్య, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతం మీదుగా మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది క్రమంగా బలపడి వాయుగుండంగా కూడా మారే అవకాశం కూడా ఉందని పేర్కొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ