కార్మికుల ఉగ్రరూపం.. సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద పోలీసులపై దాడి
సూర్యాపేట, 22 సెప్టెంబర్ (హి.స.) సూర్యాపేట జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తోటి కార్మికుని మృతితో ఆగ్రహంతో కార్మికులు పోలీసులపై దాడి చేశారు. ఈ షాకింగ్ ఘటన సూర్యాపేట జిల్లా లోని పాలకవీడు మండలం డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద చోటు చేసుకుంది. వ
పోలీసుల పై దాడి


సూర్యాపేట, 22 సెప్టెంబర్ (హి.స.)

సూర్యాపేట జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తోటి కార్మికుని మృతితో ఆగ్రహంతో కార్మికులు పోలీసులపై దాడి చేశారు. ఈ షాకింగ్ ఘటన సూర్యాపేట జిల్లా లోని పాలకవీడు మండలం డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిన్న సాయంత్రం డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న సమయంలో ఓ కార్మికుడు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలపాలయ్యాడు. దీంతో అతన్ని మిర్యాలగూడ లోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ఈ క్రమంలో కార్మికుని మృతికి యాజమన్య నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ కంపెనీ ఎదుట కార్మికులు ఆందోళనకు దిగారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో ఆగ్రహించిన కార్మికులకు పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో పోలీసులపై కర్రలు, రాళ్లతో కార్మికులు దాడికి దిగారు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులతో పాటు, పలువురు కార్మికులకు గాయాలు అయ్యాయి. కార్మికుల దాడిలో రెండు పోలీసు వాహనాలు ద్వంసం అయినట్లు సమాచారం. ప్రస్తుతం డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద పరిస్థితి రణరంగంగా మారిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులోకి రావాల్సి ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande