మీరు వాడుతున్న విదేశీ వస్తువులను వదిలేస్తారా..?'.. ప్రధాని స్వదేశీ వ్యాఖ్యలపై కేజీవాల్ ఫైర్
హైదరాబాద్, 22 సెప్టెంబర్ (హి.స.) ఆదివారం సాయంత్రం జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని మోదీ స్వదేశీ వస్తువులనే వినియోగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దీనిపై ఆన్ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. స్వదేశీ వస్త
కేజ్రీవాల్


హైదరాబాద్, 22 సెప్టెంబర్ (హి.స.)

ఆదివారం సాయంత్రం జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని మోదీ స్వదేశీ వస్తువులనే వినియోగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దీనిపై ఆన్ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. స్వదేశీ వస్తువులను వినియోగించాలని ప్రజలకు పిలుపు ఇవ్వడానికి ముందు మీరు దాన్ని ఆచరించి చూపాలని వ్యాఖ్యానించారు. ఇప్పుడు మీరు వాడుతున్న విదేశీ వస్తువులను బహిష్కరిస్తారా..? అని ప్రశ్నించారు.

ఈ మేరకు ఆయన తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్లో ఒక పోస్టు పెట్టారు. 'ప్రధాని గారూ, ప్రజలు స్వదేశీ వస్తువులను వినియోగించాలని మీరు కోరుతున్నారు. మీరు మీకుగా స్వదేశీ వస్తువులను వినియోగించడం మొదలుపెడుతారా..? మీరు రోజూ తిరుగుతున్న విదేశీ విమానాన్ని వదిలేస్తారా..? రోజంతా మీరు వినియోగిస్తున్న విదేశీ వస్తువులను విడిచిపెడుతారా..?' అని ప్రశ్నించారు.

అంతేగాక.. 'దేశంలో ఉన్న నాలుగు అమెరికా కంపెనీలను మీరు మూసేస్తారా..? డొనాల్డ్ ట్రంప్ భారత్ను, భారత ప్రజలను రోజూ అవమానిస్తున్నారు. మీరు ఏమీ చేయలేరా..? ప్రజలు వారి ప్రధాన మంత్రి నుంచి చర్యలు కోరుకుంటున్నారు. ఉపదేశాలు కాదు' అని కేజీవాల్ వ్యాఖ్యానించారు. అంతకుముందు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కూడా ప్రధాని స్వదేశీ వ్యాఖ్యలపై విమర్శలు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande