తెలంగాణ, కామారెడ్డి. 22 సెప్టెంబర్ (హి.స.)
డ్రంక్ అండ్ డ్రైవ్లో మద్యం సేవించి దొరికిన 29 మందికి జైలు శిక్షతో పాటు జరిమానా విధించినట్లు కామారెడ్డి పట్టణ సీఐ నరహరి తెలిపారు. 29 మందిని సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా నలుగురికి ఒకరోజు చొప్పున జైలు శిక్ష, మిగతా వారికి జరిమానా విధించినట్లు తెలిపారు. అనంతరం వీరికి కౌన్సిలింగ్ నిర్వహించినట్లు చెప్పారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, ట్రాఫిక్ రూల్స్ని ప్రతి ఒక్కరు తప్పకుండా పాటించాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు