విశాఖపట్టం,22 సెప్టెంబర్ (హి.స.)ఏపీలో ప్రజా సేవలు సులభతరం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇప్పటికే వాట్సప్గవర్నెన్స్ను తీసుకు వచ్చామని , సంజీవని వంటి అత్యాధునిక సేవలను ఇంటి వద్దకే తీసుకు వస్తు న్నట్లు ఆయన ప్రకటించారు. విశాఖలో 28వ ఈ గవర్నెన్స్జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు. డిజిటల్ఏపీ సంచికను ఆవిష్కరించారు. సివిల్సర్వీస్అండ్డిజిటల్ట్రాన్స్ఫార్మేషన్అనే థీమ్తో సదస్సు నిర్వహించారు. కేంద్ర ఎలక్ట్రానిక్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ, ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా ఈ సదస్సు జరుపుతోంది. ఏఐ, సైబర్సెక్యూరిటీ, పౌరసేవలు, అగ్రి స్టాక్వంటి అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్లలో ఐటీ రంగం కొత్త మలుపు తీసుకోబోతోందనిఅన్నారు. తలసరి ఆదాయంలో మనవాళ్లే టాప్, ప్రపంచంలోనే ఎక్కువ సంపాదిస్తోంది తెలుగు వారే అని తెలిపారు.
ఐటీలో హైదరాబాద్ను అగ్రగామిగా మార్చాం, నాలెడ్జ్ ఎకనామీనే మనల్ని నడిపించబోతోందని సీఎం తెలిపారు. సాంకేతికతకు అనుగుణంగా మనమూ మారాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఇవాళ అన్ని సేవలకు ప్రజలకు ఆన్లైన్లో అం దుబాటులోకి వచ్చాయని తెలిపారు. పోటీ ప్రపంచంలో వినూత్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయన్నారు. సంకల్పం ఉంటే మంచి పనులు ఎన్నయినా చేయవచ్చని అన్నారు. సరైన సమయంలో సరైన నాయకుడు దేశానికి ఉన్నాడని వ్యాఖ్యానించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి