అనిల్ అంబానీకి మరో షాక్.. సీబీఐ కేసు నమోదు
ముంబై, 5 సెప్టెంబర్ (హి.స.) ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ కి మరో షాక్ తగిలింది. ఆయనపై కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) కేసు నమోదు చేసింది. రూ.2,929.05 కోట్ల రుణ మోసం కేసులో అనిల్ అంబానీపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఫిర
అనిల్ అంబానీ


ముంబై, 5 సెప్టెంబర్ (హి.స.)

ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ కి మరో షాక్ తగిలింది. ఆయనపై కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) కేసు నమోదు చేసింది. రూ.2,929.05 కోట్ల రుణ మోసం కేసులో అనిల్ అంబానీపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ చర్యలు చేపట్టింది. ముంబైలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (ఆర్కామ్), దాని డైరెక్టర్ అనిల్ అంబానీ, ఇతరులపై ఎస్ఐఆర్ నమోదు చేసింది. మనీ లాండరింగ్ ఆరోపణలతో సంబంధమున్న రూ.2,000 కోట్ల మోసపూరిత ఎస్బీఐ రుణం కేసులో అనిల్ అంబానీకి చెందిన సంస్థలపై కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ ఇటీవలే సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande